మహాత్మ గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాసిన కాగితం గాంధీ విగ్రహానికి అంటించి ఉండడం నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో కలకలం రేపుతోంది.గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసిన గుర్తు తెలియని దుండగులు షాదుల్ను విడుదల చేయాలని తదితర డిమాండ్లతో కూడిన దండ వేసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలతో కాగితం కట్టారు.ఇది గమనించిన గ్రామస్థులు ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు . గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. షాదుల్లాను విడుదల చేయాలంటూ నినాదాలు రాసి, గాంధీ మెడకు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్ధాన్ జిందాబాద్ పేరుతో వెలసిన కాగితాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే ఈ ఘటనకు పాల్పడినది ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ కమిషనర్ కార్తికేయ గ్రామానికి వెళ్లి పరిశీలించారు..