‘రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?..గంభీర్’

‘రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?..గంభీర్’

న్యూఢిల్లీ: ‘డిబేట్లు అంటే ఇష్టం లేనప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?’ అని మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ భాజపా అభ్యర్థి గౌతమ్ గంభీర్తో తలపడిన ఆప్ అభ్యర్థి అతిషి ప్రశ్నించారు. తనతో బహిరంగ చర్చకు రావాలని ఆమె చేసిన సవాలను గౌతమ్ గంభీర్ తోసిపుచ్చినందుకు మంగళవారం ట్వీట్‌లో విమర్శలు ఎక్కుపెట్టారు. ధర్నాలన్నా డిబేట్‌లన్నా తనకు నమ్మకం లేదని మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గంభీర్ అన్నారు. దీనిపై అతిషి స్పందించారు. ‘డిబేట్లంటే నమ్మకం లేని మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? ఢిల్లీ ప్రభుత్వం క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తోంది. ఆ అకాడమీని మీరెందుకు నడపకూడదు?’ అని ప్రశ్నించారు. గౌతమ్ గంభీర్‌కు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని, ఆయనపై ఈసీ అనర్హత వేటు వేయాలని అతిషి డిమాండు చేసారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకూ ఆమె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. నియమావళి తెలియకుండా గేమ్ ఆడటమేంటని కూడా వ్యంగ్యాస్త్రాల్ని గుప్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos