న్యూ ఢిల్లీ : లడఖ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య సంభవించిన ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పదాతి దళ అధికార్లు తెలిపారు. ఇప్పటికే 20 మంది భారత సైనికులు మరణించినట్లు తెలిపారు. సైనికుల మధ్య కాల్పులు జరగలేదని, ఒకరిపై మరొకరు రాళ్లు, చువ్వలతో దాడి చేసుకున్నారని ప్రకటించారు. చైనా సైనికుల్లో 43 మంది మరణించినట్లు అనధికారిక సమాచారం.