ముంబై: స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ బుధవారం స్వల్పలాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.48 గంటలకు సెన్సెక్స్ 128 పాయింట్ల లాభపడి 39,563 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 11,813 వద్ద ట్రేడయ్యాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సన్ఫార్మా, వేదాంతా, టాటామోటార్స్లు లాభాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ ఐటీ , స్థిరాస్తి, ఫార్మా సూచీలు లాభాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ సూచీ 40 పాయింట్లు , స్మాల్క్యాప్సూచీ 46 పాయింట్లు లబ్ధి పొందింది. రూపాయి బలహీనపడింది. నేడు రూ.69.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చమురు ధర ఒక శాతం పెరిగింది.