హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని కలిసిన గద్దర్, ప్రొ. కంచె ఐలయ్య, ప్రొ. హరగోపాల్ కలుసుకున్నారు. తెలంగాణలోని పరిస్థితులపై రాహుల్ వివరించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ తెలంగాణలో సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఎవరూ సంతృప్తిగా లేరని తెలిపానని చెప్పారు. కాంగ్రెస్లో యువతకు నాయకత్వం అప్పగించాలని సూచించినట్లు చెప్పారు.