మళ్లీ మండిన పెట్రో ధరలు

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం లీటరుకి 25 పైసల చొప్పున పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ రూ.85.45, డీజిల్ ధర రూ. 75.63కు చేరింది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ.88.89, డీజిల్ రూ.82.53, విజయవాడలో పెట్రోల్ రూ.91.33, డీజిల్ రూ.85.08గా ఉన్నాయి. జైపూర్ లో అత్యధికంగా లీటరు పెట్రోల్ రూ.93.06, డీజిల్ రూ.85.08గా ఉన్నాయి. ఆ తర్వాత ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.92.04, డీజిల్ ధర రూ.82.40గా ఉంది. కోల్కతాలో లీటరు పెట్రోల్ రూ.86.87, డీజిల్ రూ79.23, చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.88.07, డీజిల్ రూ.80.90, బెంగళూరులో పెట్రోల్ రూ.88.33, డీజిల్ రూ.80.20గా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos