కారు ఢీ కొని నలుగురు పాదచార్లు మృతి

కారు ఢీ కొని నలుగురు పాదచార్లు మృతి

ముంబై : ఇక్కడి కొలాబా కూడలిలో కేఫ్ జనతా వద్ద పుట్ ఫాత్ పై సోమవారం రాత్రి కారు దూసుకు పోవటంతో పాదచార్లు నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు కారుపై పడి, మరో ముగ్గురు సమీపంలోని రెస్టారెంట్ లో కి ఎగిరి పడి మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. కారు జ్యోతి బాబరియాకు చెందినగా గుర్తించారు. కారు డ్రైవర్ సమీర్ ఇబ్రహీం కూడా గాయపడ్డాడు. కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos