ప్రచారానికి దూరంగా…గోపీనాథ్ చేయూత

ప్రచారానికి దూరంగా…గోపీనాథ్ చేయూత

హొసూరు : లాక్ డౌన్ కారణంగా హోసూరు ప్రాంతం స్తంభించడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలను చేపట్టి నిత్యావసరాలను అందజేస్తున్నది. మరోపక్క వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హొసూరు పట్టణంలోని పేద ప్రజలకు నిత్యావసరాలను అందిస్తూ ఆదుకుంటున్నారు. అందులో భాగంగా హొసూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గుట్టుచప్పుడు కాకుండా హొసూరు పారిశ్రామిక వాడ లోనే కాక పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు, పట్టణంలో నివసిస్తున్న పేద ప్రజలకు నిత్యావసరాలను అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు బహిరంగంగా  పేదలకు నిత్యావసరాలు అందించడం విధితమే అయినా  చడీచప్పుడు లేకుండా మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ పేద ప్రజలను ఆదుకుంటున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos