మోత్కుపల్లి కూడా..

మోత్కుపల్లి కూడా..

ఈ ఏడాది ఏప్రిల్‌ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలవడంతో తెలంగాణలో పాగా వేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీ అందులో చాలా వేగంగా అడుగులు వేస్తోంది.తెలంగాణలో తెరాసపై వ్యతిరేకత ఉన్న నేతలు,భవిష్యత్తు లేని కాంగ్రెస్‌,తెదేపా నేతల బీజేపీలోకి వరుస కడుతున్నారు.మూడు రోజుల క్రితం మాజీ ఎంపీ వివేక్‌ బీజేపీలో చేరగా తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మోత్కుపల్లి నర్సింహులును కలుసుకొని బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తూ చేసిన వినతికి నర్సింహులు సానుకూలంగా స్పందించారు.తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడంతో తెదేపా నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బీజేపీలో చేరాలని ఆహ్వానించగా నర్సింహులు కూడా సానుకూలంగా స్పందించారు. నర్సింహులతో పాటు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బీజేపీకి జై కొట్టారు. నెల 18 ఆయన బీజేపీలో చేరనున్నారు...

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos