ప్రతి హిందువు భగవద్గీత, రామాయణం తో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలి, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డిజిపి అరవిందరావు సూచించారు.అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు” అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి అరవింద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మతం మారే అవకాశం లేదన్నారు.హైందవ జీవన విధానాన్ని అణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయి అని చెప్పారు. హిందుత్వంలో ఎక్కడ కూడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని, కానీ ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకు వచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి, వలలో వేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.