హోసూరు : కర్ణాటక రాష్ట్రంలోని నంది కొండలు, బెంగళూరు చుట్టుపక్కల గత రెండు రోజులుగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున, దక్షిణ పెన్నా నదికి వరద నీరు పోటెత్తింది. దక్షిణ పెన్నా నదిపై హోసూరు సమీపంలోని కెలవరపల్లి వద్ద డ్యాం నిర్మించారు. వరద నీరు చేరడంతో కెలవరపల్లి డ్యాంలో నీటి మట్టం పెరిగింది. నిన్న 590 కూసెక్కుల వరద నీరు చేరగా నేడు 640 క్యూసెక్కులు వస్తున్నది. డ్యాంలో నీటి మట్టం 40.67 అడుగులకు చేరింది. వచ్చిన నీటిని వచ్చినట్లే కృష్ణగిరి డ్యాంకు వదిలివేస్తున్నారు.