ఢిల్లీ : దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నెల 29 నుంచి ‘బిగ్ బిలియన్ డేస్’అమ్మకాలను నిర్వహించనుంది. వచ్చే నెల 4 వరకు ఉండే ఈ సేల్లో వందలాది ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఎటువంటి కార్డులు లేకుండా ఏకంగా రూ.లక్ష వరకు షాపింగ్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించనుంది. ‘ముందు కొనండి.. తర్వాత చెల్లించండి` పేరిట ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. డౌన్ పేమెంట్ కూడా ఉండదు. ఇందులో ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు మూడు చెల్లింపు అవకాశాలు ఉంటాయి. మొదటిది.. జీరో వడ్డీతో తర్వాతి నెల చెల్లించడం, రెండోది జీరో వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా చెల్లించడం, చివరిది 12 నెలల ఈఎంఐ విధానంలో చెల్లించడం. దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. డిజిటల్ కేవైసీ ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.