ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నిరాశా జనకంగా ఆరంభమయ్యాయి. ఉదయం 9:21గంటలకు 6పాయింట్లు నష్టపోయి 39,187 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 11,735 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.69.59గా దాఖలైంది. యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, జీ ఎంటర్టైన్మెంట్ లాభాల్లో, రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ ఇండస్ర్టీస్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.