సింగరేణి : సింగరేణి మంగళ వారం సంభవించిన భారీ పేలుడుకు ఐదుగురు కార్మికులు బలయ్యారు. ఓపెన్ కాస్ట్-1 గనిలోని ఫేజ్-2లో పేలుడుకు ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. సంఘటన స్థలం బీభత్సంగా మారింది. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మరోఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.