కోల్కతా: పశ్చిమ బంగలో భాజపా ఒక తీవ్రవాద సంస్థ మాదిరి వ్యవహరిస్తోందని పాలక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు, కోత్కతా మహానగర మేయర్ ఫిర్హాద్ హకీమ్ సోమవారం ఇక్కడ ఆరోపించారు. ‘భాజపా ఓ తీవ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని లోక్సభ ఎన్నికలప్పటి నుంచి మూము చెబుతూనే ఉన్నాం. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కిరాయి గూండాలను బంగలోకి దించుతున్నారు. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య సృష్టికి ప్రయత్నిస్తున్నారు’ దుయ్యబట్టారు. టీవల భాట్పాడా ప్రాంతం నుంచి బంగాళీల్ని ఖాళీ ,చేయించేందుకే భాజపా చేసిన ప్రయత్నాల్ని తమ పార్టీ తిప్పి కొట్టింనందునే అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయాన్నారు. మొత్తం రాష్ట్రాన్ని బాట్పాడాలా మారనివ్వబోమని తేల్చి చెప్పారు. భాజపా ఆగడాలను అడ్డుకొని తీరతామన్నారు.