బాణసంచాపై నిషేధం సరికాదు

బాణసంచాపై నిషేధం సరికాదు

న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని ప్రభుత్వాలు ఆదేశించటాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ సహ సమన్వయకర్త డాక్టర్ అశ్వని మహాజన్ తప్పుబట్టారు. బాణసంచా వల్ల దుష్ఫలితాలు వస్తాయనే దుష్ప్రచారాన్ని నిలిపేయాలని కోరారు. వాస్తవ సమాచారం లేకుండా ప్రభుత్వాలు బాణసంచా నిషేధం సరైనది కాదన్నారు. పూర్తి స్థాయిలో నిషేధం విధించవద్దని ప్రభుత్వాలను కోరారు. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యానికి ప్రధాన కారణం చైనా నుంచి చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న బాణసంచా అని ఆరోపించారు. చైనా బాణసంచాలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ కలుపుతారని చెప్పారు. మన దేశంలో తయారయ్యే బాణ సంచా కాలుష్య రహితమైనదని వివరించారు. మన దేశంలో తయారయ్యే బాణసంచాకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos