గెలుస్తానని అనుకోలేదు..

ఎన్నికల్లో తన గెలుపోటములను అస్సలు ఊహించలేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్లో తాను ఓడిపోతానని కానీ, మల్కాజిగిరిలో గెలుస్తానని కానీ తాను ఊహించలేదన్నారు. మల్కాజిగిరిలో తానెందుకు గెలుస్తానని అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రకృతే ఆ పనులు చేసి పెడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని కేసీఆర్ అంటున్నారని, మరి 50 శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కొడుకు, అల్లుడు వచ్చి పప్పన్నం తిని వెళ్లిపోయారని, బెంజ్ కారులో వచ్చిన కూతురు కవిత బతుకమ్మ ఆడి వెళ్లిపోయిందని అన్నారు. అంతమాత్రానికే తాము ఉద్యమంలో పాల్గొన్నామని చెబుతున్నారని, అలా అయితే, ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు తీసుకున్న వారి సంగతేంటని? వారినేమనాలని.. వారి రుణం ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించారు.తెలంగాణలో ప్రస్తుతం ప్రజలు ఊహించినట్టుగా పాలన లేదని, ఇది సివిల్ వార్కు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రేవంత్ అన్నారు.

తాజా సమాచారం