అతడికి డబ్బులు ఎవ్వరు ఇచ్చారు?

అతడికి డబ్బులు ఎవ్వరు ఇచ్చారు?

న్యూఢిల్లీ: జామియా మిల్లియా విశ్వ విద్యాలయం వద్ద నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపిన యువకుడికి డబ్బులు ఎవ్వరు చెల్లించారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్కు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంటు ఆవరణలో జరిగిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్య చేసారు. ‘కాల్చిపారేయాలి అంటూ బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇవన్నీ జరుగు తు న్నా యి. ఎలాంటి ఢిల్లీని నిర్మించాలనుకుంటు న్నారు అని అడిగితే మోదీ సమాధానం చెప్పగలరా? వాళ్లు హింస వైపు నిలబ డ తారా, అహింస వైపు నిలబడతారా? అభివృద్ధి వైపు నిలబడతారాని ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్లో సవాలు విసిరారు.

తాజా సమాచారం