చెన్నై: కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం సంభవించిన పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మహిళలని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు వల్ల భవనం కుప్ప కూలింది. శిథిలాలు ఎగిరిపడ్డాయి. మృత దేహాలూ చెల్లా చెదరయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.