ఆగ్రా: పట్టణంలో లాక్ డౌన్ ను ఉల్లంఘించిన యువకుడికి పోలీసులు మంగళవారం రూ.రెండు వేలు జరిమానా విధించారు. ఇదే మాదిరి రహదారుల్లో బైక్లపై తిరుగుతున్న వారిపైనీ చర్యలు తీసుకున్నారు. ‘ఉదయం 10 గంటలకు పట్టణంలోని భగవాన్ టాకీస్ వద్ద ఒక యువకుడు ఫోనులో మాట్లాడుతూ, బైక్ పై వెళుతున్నాడన్నారు. పేరు అడగగా దీనదయాళ్ నగర్కు చెందిన రవికుమార్ అని తెలిపాడన్నారు. బైక్ మీద వెళుతూ ఫోనులో మాట్లాడుతున్నందుకు చలానా విధించామ’ని ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ‘మరో యువకుడు రోడ్డు మీద బైక్పై తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మందులు తెచ్చేందుకు వెళుతున్నానని చీటీ చూపించాడు. దీంతో అతనిని పోలీసులు వదిలేశారు. మరో సాకి అదే యువకుడు తిరిగి మందుల చీటీతో కనిపించినపుడు అతణ్ మందలించి వదిలేసార’ని ఆయన వివరించారు.