అమరావతి:సచివాలయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన జగన్ మోహన్రెడ్డి మూడు దస్త్రాల పై సంతకాలు చేశారు. ఆశా కార్యకర్తల వేతనాల్ని రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచిన దస్త్రంపై తొలి సంతకాన్ని చేశారు. ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన దస్త్రంపై రెండో, పాత్రికీయులు ఆరోగ్య బీమా పొడిగింపు దస్త్రంపై మూడో సంతకాల్నిచేశారు.