స్టాక్‌ లాభాలు అంతంతే

స్టాక్‌ లాభాలు అంతంతే

ముంబై: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో సంతృప్తి చెందాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభపడి 40,356 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 11,895 వద్ద నిలిచాయి.  డాలరుతో రూపాయి మారకం విలువ 71.78గా దాఖలైంది. సెన్సెక్స్‌ ఒక దశలో 363 పాయింట్లు లాభపడింది. చివర్లో అమ్మకాలు అధికం కావటంతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిఫ్టీలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి. ఐవోసీ, హీరో మోటోకార్ప్‌, బీపీసీఎల్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ షేర్లు నష్టాలు చవి చూశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos