ఫరూఖ్‌ అబ్దుల్లాకు చేదు అనుభవం

ఫరూఖ్‌ అబ్దుల్లాకు చేదు అనుభవం

శ్రీనగర్‌ : జమ్ము, కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాను కశ్మీరీ పండిట్‌లు అడ్డుకున్నారు. శ్రీనగర్‌లోని జ్యేష్ఠా దేవి ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన ఆయనను వారు లోపలకి రానివ్వలేదు. ఆయనకు వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. వారిని శాంతింపజేసి, ఆలయంలోకి వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చేసేదిలేక ఆయన వెనుదిరిగారు. అనంతరం పండిట్‌లు విలేకరులతో మాట్లాడుతూ తాము కశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో దుస్థితిని అనుభవిస్తుండడానికి ఫరూఖ్‌ అబ్దుల్లా లాంటి నాయకులే కారణమని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos