న్యూఢిల్లీ : అమెరికా చేతిలో భారత్కు గుణపాఠం తప్పదని జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం ఇక్కడ హెచ్చరించారు. తమ ఉత్పత్తులపై భారత్ భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తుండగా మన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఉగ్రవాదం, పాకిస్తాన్ను ఏకాకిని చేసే అంశాల్నే ప్రధానంగా జీ 20 సదస్సులో ప్రసంగించటం సరికాదన్నారు. పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుని అమెరికాతో సంబంధాలు చెడకుండా చూసు కోవాలని హితవు పలికారు. అమెరికా నుంచి దిగుమతయ్యే 28 ఉత్పత్తుల పై భారత్ సుంకాలు విధించింది.