న్యూ ఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడి సింఘు సరిహద్దులో సాగుతున్న ఉద్యమంలో మరో అన్నదాత గురువారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పంజాబ్లోని ధాట్కు చెందిన జగ్జీత్సింగ్ అలియాస్ బబ్బూగా గుర్తించారు. గుండె పోటుతో అతను మరణించినట్లు తెలుస్తోంది. జనవరి 14న రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చాడు జగ్జీత్ సింగ్. అతడి మరణ వార్త తెలియగానే తన సొంతూరిలో రోదనలు మిన్నంటాయి.