లాటరీ టికెట్ వివాదం ఓ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది.తమిళనాడులోని విల్లుపురం, సిద్ధేరి సమీపంలోని సలామత్ ప్రాంతానికి చెందిన అరుల్ అనే వ్యక్తి చాలా కాలంగా ఆభరణాల వ్యాపారం నిర్వహించేవాడు.అయితే కొద్ది కాలంగా వ్యాపారంలో రాబడి బాగా తగ్గిపోవడంతో లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించాడు.లాటరీపై ఆశతో వస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని సైతం మొత్తం లాటరీ టికెట్లకే ఖర్చు చేస్తుండడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది.దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన భార్య, ముగ్గురు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తానూ దాన్ని తాగడంతో వారందరూ మృతి చెందారు.ఈ ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరించి, కొందరికి షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వెంటనే కొంత మంది అరుల్ ఇంటికి చేరుకుని, అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి ప్రవేశించారు. అయితే, అప్పటికే ఐదుగురు మృతి చెందారు.