ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారం సోమవారం భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 2,627 పాయింట్లు కూలి 27,347 వద్ద, నిఫ్టీ 768 పాయింట్లు పతనమై 7,976 వద్ద ఆగాయి. ఏడు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడం, కొవిడ్-19 రెండో దశకు చేరడం, ఆదివారం ముగ్గురు మృతి చెందటం తదితర కారణాల వల్ల మదు పరులు అమ్మాకాలకు మొగ్గు చూపారు. పలు కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపి వేసినందున అది వాటి ఆదాయాల్ని ప్రభావితం చేయనుండటమూ మరో కారణమని విశ్లేషకులు తెలిపారు.