చైనా ఇప్పుడిప్పుడే నిజం చెప్పదు

చైనా ఇప్పుడిప్పుడే నిజం చెప్పదు

లడఖ్:ఇక్కడి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు యూఎస్ న్యూస్.కామ్ పేర్కొంది. తమ జవాన్ల మృతిని చైనా అవమానంగా భావించినందునే మృతుల సంఖ్య వెల్లడించేందుకు విముఖత వ్యక్తం చేస్తోందని తెలిపింది. మృతుల్లో చైనా సైనిక సీనియర్ అధికారి కూడా ఉన్నారని వెల్లడించింది. ‘తుపాకులు, కాల్పులు లేని ఇలాంటి ఘర్షణల్లో తనకు జరిగిన ప్రాణ నష్టం వివరాలను చైనా ఎప్పుడూ వెంటనే బయటపెట్టదు. ఆ వివరాలను కొన్ని దశాబ్దాల తర్వాత వెల్లడిస్తుంది. 1962లో జరిగిన యుద్ధంలో తమ వైపున జరిగిన ప్రాణనష్టం వివరాలను 1994లో వెల్లడించింద’ని అమెరికా, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనా వ్యవహారాల విభాగం నిపుణుడు టేలర్ ఫార్వెల్ తెలిపారు. ఫ్రీప్రెస్ జర్నల్ కూడా కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. గత 50 ఏళ్లలో భారత్, చైనా మధ్య అనేక ఘర్షణలు జరిగాయని, అయితే చైనా ప్రాణ నష్టాలను దాచిపెడుతోందని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos