వాషింగ్టన్ : వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన వైఫల్యాలపై అమెరికా నియంత్రణ సంస్థ ఫేస్బుక్కు 500 కోట్ల (సుమారు రూ.34 వేల కోట్లు) జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 3-2 ఓట్లతో అంగీకరించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అయితే ఈ సెటిల్మెంట్ను అమెరికా న్యాయశాఖ అంగీకరించాల్సి ఉంది. ఫేస్బుక్పై గతంలోనూ భద్రతా వైఫల్యాల ఆరోపణలు వచ్చాయి. దీంతో 2011లో ఈ కంపెనీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్తో ఒప్పందానికి వచ్చింది. అయితే ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గతేడాది ఫేస్బుక్పై ఉన్న కేసును మళ్లీ తెరిచింది. ఒప్పందంలో భాగంగానే భారీ జరిమానా విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి కోట్లాది మంది యూజర్ల డేటాను తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.