ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌లపై చర్యకు డిమాండ్‌

ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌లపై చర్యకు డిమాండ్‌

న్యూ ఢిల్లీ : విద్వేష విషయాల్ని సామాజిక మాధ్యమంలో ప్రచారానికి భాజపా నేతలకు ఫేస్బుక్ అనుమతిస్తోందని ఆ సంస్థ అధిపతి మార్క్ జుకర్బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆ లేఖను మంగళ వారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ‘హింసను ప్రేరేపించే , సమాజ విభజన వాద విషయ ప్రచారానికి ఎఫ్బీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ భాజపా చేతిలో పావులా మారారు. ఆగస్ట్ 14న వాల్స్ర్టీట్ జర్నల్లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్ధాపక నేతలు ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారింది. ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేద’ని ఆ లేఖలో పేర్కొంది .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos