రేపు మంత్రి వర్గ విస్తరణ

రేపు మంత్రి వర్గ విస్తరణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి శనివారం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఇక్కడి సచివాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రి వర్గ సభ్యులచే గవర్నర్‌ నరసింహన్ ప్రమాణాన్ని చేయించనున్నారు.ఈ కార్యక్రమానికి ఐదు వేల మంది హాజరు కానున్నట్లు అంచనా వేసామని గుంటూరు జాయింట్ కలెక్టర్ హీమాన్షు శుక్ల విలేఖరులకు తెలిపారు. ఆహ్వానితులు రెండు మార్గాల్లో వేదిక వద్దకు చేరుకోవచ్చు. ప్రవేశ పత్రాల్ని కలిగిన వారు గ్యాలరీలో తమకు కేటాయించిన చోట కూర్చోవాలి. ప్రవేశ పత్రాలు లేని వారు కూడా హాజరు కావచ్చు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందిస్తారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేసారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామన్నారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos