పన్ను రాయితీలు ఇవ్వలేం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వలేమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభలో తేట తెల్లం చేసారు. వైకాపా సభ్యుడు అవినాశ్ రెడ్డికి ఈ మేరకు బదులిచ్చారు. విధాన పరమైన నిర్ణయాల్ని దేశ వ్యాప్తంగా అమలు చేయడం తప్ప ఏదో ఒక రాష్ట్రానికి మినహింపులు, ప్రత్యేకతలు కల్పించటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వృద్ధి జరగ లేదు. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. నాటి ప్రధాని హామీ ఇచ్చిన ప్రకారం ప్రత్యేక హోదా ఇంకా రాలేదు. కనీసం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పింస్తుందా’ అని ప్రశ్నించారు. విశాఖ మెడిటెక్ జోన్ బాగా పనిచేస్తోందని గడ్కరి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos