గోదాముల్లో ఉన్న తిండి గింజల్ని ఎప్పుడు పేదలకు పంపిణీ చేస్తారు?

గోదాముల్లో ఉన్న తిండి గింజల్ని ఎప్పుడు పేదలకు పంపిణీ చేస్తారు?

లక్నో : గోదాముల్లో ఉన్న తిండి గింజల నిల్వలను ప్రభుత్వాలు ఇంకెప్పుడు పేదలకు పంపిణీ చేస్తాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించాయి. ‘ వలస కూలీలకు అవసరమైన ఆహార పదార్థాలను అందించాలి. అవసరమై ఆర్థిక సాయాన్ని కూడా చేయాలి. . వలస కార్మికులకు ప్రభుత్వాలు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే బాగుండేది. వారి వారి స్వస్థలాలకు క్షేమంగా చేరుకునేలా ప్రభుత్వాలు చూడాలి. కరోనా పరీక్షల సంఖ్యను పెంచే ముందు లక్షల సంఖ్యల్లో ఉన్న వలస కార్మికులకు ఆహారం దొరికేలా చేయాలి. లేదంటే వారి ఆకలి ఎలా తీరాలి? ఆహారం లేకుంటే కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది? గోడౌన్లలో ఉన్న ఆహార పదార్థాల నిల్వలను ప్రభుత్వాలు ఇంకెప్పుడు వినియోగిస్తాయి?’ అని నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos