భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో దేశ ప్రజలు సతమతమవుతున్నవేళ కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా ఇదే విధంగా పెట్రోలు, డీజిల్లపై సుంకం తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దరిమిలా రాష్ట్రాల్లో పెట్రోల్పై మరో రూపాయిన్నర దాకా తగ్గే అవకాశం ఉంది. డీజిల్పై కూడా రూపాయి తగ్గే అవకాశం ఉంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గనుంది.