కుల్గాం: జమ్మూ-కశ్మీర్, కుల్గాం పట్టణంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల కోసం కుల్గాం పట్టణం శనివారం ఉదయం గాలిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు అనివార్యమయ్యాయి.ఇంకా కాల్పులు, గాలింపులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.