విశాఖపట్నం: విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లోని చొప్పకొండ, బురద కోట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ గాలింపులు చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు సంభవించాయి. 48 నిమిషాలపాటు పరస్పరం కాల్పలు జరుపుకున్నారు. మావోయిస్టులు తప్పించుకున్నారు.ఆ స్థలంలో పోలీసులకు మూడు 303 తుపాకులు, ఆరు సంచులు దొరికాయి. గాలింపులు కొనసాగుతున్నాయి.