ఏలూరు : ఏలూరు జిల్లా ఆసుపత్రిలో బాధితులను ముఖ్యమంత్రి జగన్ సోమవారం పరామర్శించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన జరిపిన సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు అధికార్లు నానా తిప్పలు పడ్డారు. ఇందుకు కారణం ఆయన భద్రతా సిబ్బంది అవివేకం. ఆరోగ్య శాఖ సంచాలకులు, అదనపు సంచాలకుల్నీతొలుత పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.