వచ్చాయి కానీ…వెళ్లడం తెలియక

వచ్చాయి కానీ…వెళ్లడం తెలియక

మైసూరు : ఏనుగుల మంద దారి తప్పి ఊరి మీద పడింది. వచ్చిన పని అయిందో, లేదో తెలియదు కానీ మళ్లీ అడవిలోకి వెళ్లాలనుకున్నాయి. అయితే వాటికి దిక్కు తోచలేదు. రోడ్డు పక్కగా నిలుచుకుని నలువైపులా చూశాయి. ఎక్కడా దారి కనిపించలేదు. విధి లేక అక్కడే ఉన్న గోడ దూకి అడవిలోకి వెళ్లాలనుకున్నాయి. అతి కష్టం మీద గోడ దూకి అడవి చేరుకున్నాయి. ఇందులో ఓ వృద్ధ ఏనుగు తన కూనను దాటించడానికి నానా కష్టాలు పడింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ పాత వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కష్వన్ ట్విటర్‌లో షేర్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు పలు విధాలుగా విచారం వ్యక్తం చేశారు. మానవులే వాటి దుస్థితికి కారణమని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos