ఏనుగుల దాడిలో వరి పంట ధ్వంసం

ఏనుగుల దాడిలో వరి పంట ధ్వంసం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని పోడూరు గ్రామం వద్ద రెండు ఏనుగులు వరి పంటపై పడి ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సానమావు అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. పగటి పూట అడవిలో తిరుగుతూ రాత్రి పూట ఆహారం కోసం సమీప గ్రామాల పంటలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. సోమవారం రాత్రి పోడూరు గ్రామం వద్ద గల వరి పంటను ఆరగించాయి. కొద్ది రోజులలో కోతకు వచ్చే పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏనుగుల బారి నుంచి తమ పంటను కాపాడాలని రామాపురం, పోడూరు, పాతకోట గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం