అనారోగ్యంతో ఏనుగు మృతి

అనారోగ్యంతో ఏనుగు మృతి

హోసూరు : ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఓ ఏనుగు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణగిరి జిల్లా ఉరిగం అటవీ ప్రాంతంలో వందల కొద్దీ ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అనారోగ్యం పాలై మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఏనుగు అనారోగ్యంతో మృతి చెందిందా లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos