ఏనుగు దాడిలో వృద్ధునికి తీవ్ర గాయాలు

ఏనుగు దాడిలో వృద్ధునికి తీవ్ర గాయాలు

హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని గుల్లట్టి గ్రామంలో వృద్ధునిపై ఏనుగు దాడి చేసింది. గ్రామానికి చెందిన మాదప్ప(65) గ్రామ శివారులో పశువులు మేపుతుండగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగు దాడి చేసింది. ఈ సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డెంకణీకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ధర్మపురి ఆస్పత్రికి పంపించారు. డెంకణీకోట అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

తాజా సమాచారం