దిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే దానిపై ఈసీ కసరత్తు చేస్తోంది. 2014లో మాదిరిగానే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించడంపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.