ఏనుగు మృతిపై దర్యాప్తు

ఏనుగు మృతిపై దర్యాప్తు

తిరువనంత పురం: మనుషుల క్రూరమైన చర్యలకు గర్భంతో ఉన్న ఏనుగు బలికావటానికి దారి తీసిన పరిస్థితులపై వన్యప్రాణి విభాగ నేర పరిశోధనా బృందం దర్యాప్తు చేపట్టిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. ‘ఈ ఘటనపై నివేదిక కోరాం. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామ’ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీలో అన్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, ఇండియా సంస్థ రూ. 50వేల నగదు బహుమతి ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos