ఎమ్మెల్యేల‌ కొనుగోళ్ళల్లో కేసీఆర్ రారాజు

ఎమ్మెల్యేల‌ కొనుగోళ్ళల్లో కేసీఆర్ రారాజు

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కేసీఆర్ రారాజుగా మిగిలారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. 2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఛానల్ను నిషేధించి మీడియాపై విషం చిమ్మిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై సీఎం కేసీఆర్వి మొసలి కన్నీళ్ళని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు ఎలా అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగిందే మునుగోడులో జరిగబోతోందని చెప్పారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు. ఓటమి భయంతోనే మునుగోడులో టీఆర్ఎస్ హింసను ప్రేరేపించిందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos