అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ ఫలితాలు ఈ నెల 17న విడుదలవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యా శాఖ అధికారులు విజయవాడలో ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 6న 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. సుమారు 13 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో వైపు ఈ నెల 18న మధ్యాహ్నం ఎంసెట్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు జరిగిన ఏపీ ఎంసెట్కు ఆంద్రా, తెలంగాణల నుంచి 2,82,901 మంది విద్యార్థులు హాజరయ్యారు.