న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దివంగత రాజీవ్గాంధీని ప్రధాని మోదీ ‘భ్రష్టాచారి నంబర్ వన్’గా అభివర్ణించటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరించింది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని సాగించిన మోదీ, అవినీతి పరుడైన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీని ఆయన సన్నిహితులు మాత్రమే మిస్టర్ క్లీన్గా పొగిడారని వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడిన కాంగ్రెస్ మోదీ ఎన్నికల నియమావళని ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ‘ఫిర్యాదులో పేర్కొన్న మోదీ ప్రసంగాన్ని పరిశీలించాం. ఎన్నికల నిబంధనల్ని మోదీ ఉల్లంఘించినట్లు . దీంతో మీ ఫిర్యాదును కొట్టివేస్తున్నాం’ అని ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకత్వానికి తెలిపింది.