‘శవ రాజకీయాలు మానండి పవన్, లోకేశ్’

‘శవ రాజకీయాలు మానండి పవన్, లోకేశ్’

అమరావతి : ఉద్దండరాయుని పాలెంకు చెందిన పులి చినలాజర్ మృతిని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే వక్రీకరి స్తున్నారని మృతుడి కుమార్తె ఈస్తేర్ సోమవారం ట్విట్టర్ లో విమర్శించారు. ‘ఏమయా పవన్ ఇప్పుడు గుర్తొచ్చారా మా నాన్న గారు. ఆయన అమాయకత్వం అడ్డం పెట్టుకుని ఆత్మీయ తండ్రి అంటూ పొగడ్తలతో మురిపించి నీ పబ్బం గడుపుకున్నావు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏ పంచన చేరావు? ఇప్పుడు సానుభూతి చెప్పుకొస్తున్నావు. మా నాన్న గారు చనిపోయి పుట్టెడు దుఖఃలో ఉన్నాము ఆయన మరణాన్ని మీ నీచ రాజకీయాల కోసం వాడుకుని పబ్బం గడుపుకో వద్దు. చేతనైతే నాలుగు ఆదరణ మాటలు చెప్పండి లేకుంటే మౌనంగా ఉండండి. అంతే గాని రాజధాని కోసం గుండె ఆగిందంటూ… దాని కోసం దీని కోసం అంటూ పిట్ట కథలు అల్లొద్దు. అనారోగ్యం కారణంగానే నా తండ్రి మరణించారు. ప్రభుత్వ వేధింపులు అంటూ చెత్త రాతలు రాయకండి’ అని పవన్కు ఘాటుగా సమాధామనిచ్చారు. లోకేష్ పోస్టునూ ఖండించారు. అబద్ధాలని ట్విట్టర్లో నే ఘాటుగా స్పందించారు. ‘మా నాన్న గురించి ఎవరు చెప్పారు నీకు. మా నాన్న మృతిని కంపు రాజకీయాలకు వాడుకోవడానికి నీవెవరు? ఏనాడైనా మా ఊరు వచ్చావా? మా నాన్న గారిని పరామర్శించి మాట్లాడావా? లంక భూముల సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు.. భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ముఖాలైనా చూడలేదు మీరు. మా నాన్న రాజధాని గురించి కాదు. ఆరోగ్యం బాగొక చనిపోయారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే అందరికీ సమన్యాయం జరగాలి, మన స్వార్థం చూసుకోకూడదు అని జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించిన వ్యక్తిత్వం. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి’ అంటూ బదులిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos