శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శనివారం పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ సాయంతో పది ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. మన దేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్(ఈవోఎస్ 01) శాటిలైట్తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్సంబర్గ్కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది.