పళనిస్వామికి బాంబు బెదిరింపు

పళనిస్వామికి బాంబు బెదిరింపు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసం, కార్యాలయంపై బాంబులతో దాడి చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు బాంబ్, జాగిలాల దళాలతో పళనిస్వామి నివాసం, కార్యాలయం సమీపంలో తనిఖీలను చేపట్టారు. ఆ తర్వాత అది నకిలీ కాల్ గా తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ చేసిన యువకుడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపును ప్రారంభించారు.ఇక్కడి గ్రీమ్స్ రోడ్డులో ఉన్న పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయం వద్ద భద్రతను పెంచారు. పళనిస్వామి నివాసం, కార్యాలయానికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos