అమరావతి : సచివాలయం వద్ద బుధవారం ఉదయం ఒక డ్రోన్ కెమెరా కలకలాన్ని సృష్టించింది. సచివాలయం వద్ద బస్సు దిగి వస్తున్న శాసనసమండలి సభ్యులు లోకేశ్, అశోక్ బాబు, దీపక్రెడ్డి వద్ద డ్రోన్ పడింది. నిర్వహణా లోపం వల్ల విద్యుత్ తీగలు తగిలి పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ డ్రోన్ను అక్కడి నుంచి తొలగించారు.